26.3 C
Hyderabad
Thursday, June 19, 2025
spot_img

నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ: సీఎం కేసీఆర్

స్వతంత్ర, వెబ్ డెస్క్: నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణగా భాసిల్లుతోందని అన్నారు సీఎం కేసీఆర్. నూతన సచివాలయంలో ఏర్పాటు చేసిన దశాబ్ది వేడుకల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు.రాష్ట్ర తలసరి ఆదాయంలో 155 శాతం వృద్ధితో పెద్ద రాష్ట్రాలను దాటామని అన్నారు. మన నగరాలు.. ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నాయి. అలాగే అనేక రంగాల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలుస్తోందన్నారు. ఎత్తిపోతల పథకాలతో బీడుభూములన్నీ సస్యశ్యామలం చేసామన్నారు. తాగునీటి కష్టాలకు మిషన్ భగీరథ చరమగీతం పాడిందని.. మన పల్లెలకు జాతీయస్థాయి అవార్డులు వస్తున్నాయని కొనియాడారు. రాష్ట్ర పథకాల పట్ల దేశమంతటా ఆదరణ కనిపిస్తోందన్న ముఖ్యమంత్రి.. సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.

శుద్ధి చేసిన తాగునీరు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం.. తెలంగాణ అని కొనియాడారు. తాగునీరు అంశంలో రాష్ట్రానిది దేశంలోనే ప్రథమస్థానంలో ఉందన్నారు. మిషన్ భగీరథకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. నేడు రాష్ట్రంలో ఫ్లోరైడ్ బాధలు లేవని కేంద్రమే ఒప్పుకుందని తెలిపారు. తెలంగాణ వస్తే అంధకారమేనని గతంలో పాలకులు ఎద్దేవా చేశారు.. కానీ ఇప్పుడు విద్యుత్తు అంశంలో విప్లవాత్మక విజయాలు సాధించామన్నారు. సాగుకు నిరంతర ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అభివర్ణించారు.

సంక్షేమ రంగంలో తెలంగాణ స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. దశాబ్ది ఉత్సవాల్లోనే రెండోవిడత గొర్రెల పంపిణీ ప్రారంభం, పోడు భూములకు పట్టాల ప్రారంభం, పోడు భూములకూ రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ, 24 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తామన్నారు.

హైదరాబాద్‌ అభివృద్ధి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారన్న సీఎం.. హరితహారంలో 9 ఏళ్లలో 273 కోట్ల మొక్కలు నాటామని స్పష్టం చేశారు. హరితహారంతో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని తెలిపారు. ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా హైదరాబాద్‌కు రెండుసార్లు గుర్తింపు వచ్చిందన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 19న హరితోత్సవం వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. అతిపెద్ద మానవ ప్రయత్నంగా హరితహారానికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చిందని తెలిపారు. మరోవైపు 9 ఏళ్లలో విద్యారంగంలో అద్భుత ఫలితాలు సాధించామని పేర్కొన్నారు.

ఎంఎన్‌సీ ఉద్యోగాలు సాధించేస్థాయికి గురుకులాలు ఎదిగాయన్నారు. స్వల్ప వ్యవధిలోనే వైద్య, ఆరోగ్య సేవల ప్రమాణాలు పెంచామని తెలిపారు. పాలనా సంస్కరణలు సత్వర అభివృద్ధికి చోదకశక్తిగా మారాయన్నారు దేశంలో అధిక వేతనం పొందుతున్నది మన ఉద్యోగులేనని స్పష్టం చేశారు. 20 వేల వీఆర్ఏల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోందని.. మరోవైపు 9,355 మంది జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ కొనసాగుతోందన్నారు. టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని అభివర్ణించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు రాష్ట్రం గమ్యస్థానమైందని వ్యాఖ్యానించారు.

స్వరాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవానికి కృషి చేశామన్న సీఎం.. యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతమని అందరూ కొనియాడుతున్నారని తెలిపారు. ఇదే స్పూర్తితో మరింతగా కొండగట్టు, వేములవాడ, ధర్మపురిని అభివృద్ధి చేస్తామని అన్నారు. భద్రాద్రిని వైభవంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. కాశీలో 60 వేల చదరపు అడుగుల్లో వసతిగృహం నిర్మిస్తాం.. అలాగే శబరిమలలో రాష్ట్ర భక్తుల కోసం వసతిగృహం నిర్మిస్తామని అన్నారు. దశాబ్ది ముంగిట నిలిచిన రాష్ట్రానిది విప్లవాత్మక విజయ యాత్ర అని అభివర్ణించారు. రాష్ట్రాన్ని జనం గర్వించే స్థాయికి తెచ్చిన నా జీవితం ధన్యమైందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం అందుకోవాల్సిన శిఖరాలు మరెన్నో ఉన్నాయని ఆ దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్