ఏం జరిగింది..? ఎందుకు జరిగింది? లోపం ఎక్కడుంది.? ఇలా ఒక్కో అంశంపై దృష్టి సారిస్తోంది కాంగ్రెస్ పార్టీ. లోక్సభ ఎన్నికల్లో అధికారం హస్తగతం కాకపోయినా కమలనాథులకు ముచ్చెమటలు పట్టించడంలో సక్సెసైంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఏయే రాష్ట్రాల్లో పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందో తెలుసుకునేందుకు నిజనిర్థారణ కమిటీలను నియమించింది. జరిగిన పొరబాట్లను గమ నించి, సరిదిద్దుకొని రాబోయే ఎన్నికలకు సిద్ధం కాబోతోంది హస్తం పార్టీ.
జస్ట్ మిస్ అవును మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో తృటిలో అధికారాన్ని కోల్పోయింది ఇండియా కూటమి. అయినా సరే ఎన్నికల్లో కమలం నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇవ్వడమే కాదు.. దడ పుట్టేలా చేసింది. ప్రత్యేకించి ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూట మిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే తన స్థానాలను గణనీ యంగా పెంచుకుంది. నేతల్లో హుషారు నింపింది. అయితే అంతా బాగానే ఉన్నా అధికారం సాధించే క్రమంలో చివరి మెట్టు మీద బోల్తా పడడంతో రాబోయో రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి ఇలాంటి సీన్ రిపీట్ కాకుండా చూడాలని భావిస్తోంది హస్తం హైకమాండ్. ఇందులో భాగంగా మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిన రాష్ట్రాల్లో అసలేం జరిగింది. సీట్లు రాకపోవడానికి, తక్కువగా రావడటా నికి గల కారణాలను అన్వేషించే పనిలో పడింది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రా ల్లో నెలకొన్న పరిస్థితులపై అంతర్గ తంగా సమీక్షలు జరిపేందుకు నిజనిర్థారణ కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో రాష్ట్రానికి ముగ్గురు సభ్యులతో కూడిన నిజనిర్థారణ కమిటీలను నియమించింది హైక మాండ్. ఈ కమిటీలు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి పార్టీ తోపాటు నేతల పనితీరుపై అధ్యయనం చేయ నుంది. అనంతరం పూర్తి అంశాలతో ఓ నివేదిక తయారు చేసి హస్తిన పెద్దలకు ఇవ్వనున్నారు నిజ నిర్థారణ కమిటీ సభ్యులు.
నిజనిర్థారణ కమిటీలు ఏర్పాటు చేసిన రాష్ట్రాల విషయానికి వస్తే మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, ఒడిషా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలున్నాయి. ఆయా రాష్ట్రాలు, అక్కడ వచ్చిన లోక్సభ సీట్లను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్లో ఉన్న 29 లోక్సభ స్థానాల్లో హస్తం పార్టీ ఒక్క పార్లమెంటు స్థానం కూడా గెల్చుకోలేక పోయింది. ఇప్పుడే కాదు. 2019 ఎన్నికల్లోనూ ఇదే సీన్. దీంతో.. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఎందుకిలా తయారైందన్న దానిపై దృష్టి పెట్టనున్నారు నిజ నిర్థారణ కమిటీ సభ్యులు. దీంతో పృథ్వీరాజ్ చవాన్, సప్తగిరి ఉలాక, జిగ్నేష్ మేవానీ కమిటీ ఇక్కడ పర్యటించి వాస్తవ పరిస్థితు లను తెలుసుకోనుంది. మధ్యప్రదేశ్కు పొరుగునే ఉన్న చత్తీస్గఢ్లోనూ దాదాపుగా ఇలాంటి ఫలితాలే వచ్చాయి. కాకపోతే కంటి తుడుపుగా ఒక్క ఎంపీ సీటు హస్తగతమైంది. మొత్తం 11 సీట్లలో పది బీజేపీ, ఒకటి కాంగ్రెస్ పార్టీ సాధించి సంతృప్తి చెందాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ ఓటమి పాలైన కాంగ్రెస్.. ఇప్పుడు ఎంపీ స్థానాల్లోనూ దాదాపుగా గల్లంతైన పరిస్థితికి చేరుకుంది. ఇక్కడ పార్టీ పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు సీనియర్ నేత వీరప్పమొయిలీతోపాటు హరీష్ చౌదరికి బాధ్యతలు అప్పగించింది హస్తం పార్టీ అధిష్టానం.
ఒడిషాలోనైతే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇక్కడ సుదీర్ఘకాలం పాటు బీజేడీ అధికారంలో ఉండగా.. ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ స్థాయినీ కోల్పోయింది. ఇక్కడున్న 21 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ అంశాలపై క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు అజయ్ మాకెన్, తారిఖ్ అన్వర్లను రంగంలోకి దింపింది కాంగ్రెస్ హైకమాండ్. అటు ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోనూ కాంగ్రెస్ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి లోక్సభ తరఫున ప్రాతినిథ్యమే లేకుండా పోయింది. పైగా హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్నా ఎలాంటి ప్రభావం లోక్సభ ఎన్నికల్లో చూపకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది కాంగ్రెస్ పార్టీ. దీంతో.. సీనియర్లు పీఎల్ పూనియా, రంజనీ పాటిల్ను రంగంలోకి దింపారు. పార్టీ పరిస్థితులపై వాస్తవాలు వివరించాలని సూచించారు కాంగ్రెస్ అగ్రనేతలు.
ఈ రాష్ట్రాలన్నీ ఒక ఎత్తైతే కర్ణాటక, తెలంగాణ మరో ఎత్తనే చెప్పాలి. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. దీంత మెజార్టీ లోక్సభ స్థానాలు వస్తాయని భావించారు. కానీ, కర్ణాటకలో కాంగ్రెస్కు 28 సీట్లలో కేవలం 9 మాత్రమే సాధించింది. అయితే ఇందుకు కారణం ప్రధానంగా సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య ఉన్న వివాదాలే అన్న మాట విన్పిస్తోంది. మరి నిజానిజాలేంటి అన్న దానిపై మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలోని కమిటీ పరిశీలించనుంది. ఇక, తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ నేతృత్వంలో గతేడాది చివర్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. పవర్లో ఉన్నా కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో అసలు ఏం జరిగింది. బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఆ ఓటు బ్యాంకు కాస్తా బీజేపీకి వెళ్లిందా మరోటి జరిగిందా అన్న అంశాలతోపాటు ఇతర సమీకరణాలను పూర్తిస్థాయిలో విశ్లేషించనుంది పీజే కురియన్ నేతృత్వంలోని కమిటీ. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో రంగంలోకి దిగనున్న కమిటీలు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్రమైన నివేదికను రూపొందించను న్నాయి. వాటిని విశ్లేషించుకొని రాబోయే రోజుల్లో తమ వ్యూహాలకు మార్పులు చేర్పులు చేసి మంచి ఫలితాలు రాబట్టాలని వ్యూహం రచిస్తోంది హస్తం హైకమాండ్. మరి, కాంగ్రెస్ పార్టీ వ్యూహం వర్కవుటవు తుందా ? అన్నది రాబోయే ఎన్నికల్లో తేలనుంది.