తెలంగాణ రాజకీయాల్లో బాంబుల వార్ నడుస్తోంది. త్వరలోనే పొలిటికల్ బాంబులు పేలతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సియోల్ వేదికగా వెల్లడించడం పాలిటిక్స్లో కలకలం రేపింది. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వారిని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఒకటే చర్చ సాగుతోంది. ఏ కేసులో అరెస్ట్లు ఉంటాయోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మంత్రి వ్యాఖ్యలపై ఎన్నో ఊహాగానాలు సాగుతున్న వేళ… పొంగులేటికి కౌంటరిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒరిజినల్ బాంబులకే తాము భయపడలేదన్నారు. చిట్టి నాయుడు బెదిరింపులకు భయపడేది లేదన్న ఆయన.. కేసులు పెట్టి ఏం చేసుకుంటారో చేసుకోండని వ్యాఖ్యానించారు. బాంబులు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన మీద జరిగిన ఈడీ రైడ్ల గురించి చెబుతారేమో అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణలో పొలిటికల్ బాంబులు ఉంటాయన్న పొంగులేటి కామెంట్లపై సెటైర్లు వేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనన్నారు. కానీ, బయటకు మాత్రం వేరేలా కన్పిస్తాయంటూ సెటైర్లు వేశారు బండి సంజయ్.


