30.2 C
Hyderabad
Monday, February 3, 2025
spot_img

యూపీఏ, ఎన్డీయేలు.. నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయాయి- రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంటులో కీలక వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ నేతృత్వంలోని యూపీఏ లేదా గత దశాబ్ద కాలంగా దేశాన్ని పాలించిన ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కానీ.. దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయాయని అన్నారు.

రాహుల్‌ గాంధీ సోమవారం పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు అందిరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎందుకంటే రాహుల్‌ తన మాటల దాడిలో ప్రశంసలు కూడా ఉన్నాయి. ఎప్పుడూ ఎన్డీయే ప్రభుత్వం, ప్రధాని మోదీపై చెలరేగి మాట్లాడే రాహుల్‌ గాంధీ.. ఈ సారి అంతగా మాటలతో దాడులు చేయకపోగా.. ప్రశంసలు కూడా కురిపించారు. రాహుల్‌ ఏమన్నారంటే.. భారతదేశం తయారీ రంగంలో ఇంకా ముందడుగు వేయల్సి ఉందని అన్నారు. అదే సమయంలో ..” ప్రధాని మోదీ ఉత్పాదకతను పెంచడానికి ప్రయత్నించారు.. ఆయన ప్రధాన చొరవ మేక్‌ ఇన్‌ ఇండియా మంచి కాన్సెప్ట్‌”.. అని అన్నారు.

“మనం వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే… నిరుద్యోగం. ఈ సమస్యను మేము పరిష్కరించలేకపోయాము. యూపీఏ లేదా నేటి ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి గురించి ఈ దేశ యువతకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయాయి “.

“మంచి కంపెనీలు ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నించాయి, కానీ విఫలమయ్యాయి” అని గాంధీ అన్నారు, “… కానీ ఇప్పుడు మనం చైనాకు ఉత్పత్తిని అప్పగించాము …”

Latest Articles

ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్‌లు అందించిన సోనూసూద్‌

నటుడు, సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సోనూసూద్‌ను ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. ఆరోగ్యం-సామాజిక సంక్షేమం విషయంలో సేవలు అందించే సూద్ చారిటీ ఫౌండేషన్‌... రాష్ట్రంలో ప్రజారోగ్య సంరక్షణ కోసం నాలుగు అంబులెన్స్‌లను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్