25.2 C
Hyderabad
Sunday, June 29, 2025
spot_img

హైదరాబాద్ లో టెన్షన్.. రాజ్‌భవన్‌ ముట్టడికి TSRTC కార్మికుల పిలుపు

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం తెలుపకుండా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సైలెంట్ గా ఉండడం పట్ల తెలంగాణ సర్కార్ ఆగ్రహంగా ఉంది. ఇదే క్రమంలో ఆర్టీసీ కార్మికులు సైతం గవర్నర్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్ (Thamilsai) కు వ్యతిరేకంగా నినాదాలు , నిరసనలు తెలుపుతున్నారు. అలాగే ఈరోజు 11 గంటలకు రాజభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో (Assembly Bill)) బిల్లు కనుక పెట్టలేకపోతే.. శాసనసభ ఎన్నికలు పూర్తయ్యేవరకు వాయిదా పడినట్టే.

వేలమంది జీవితాలతో ముడిపడి ఉన్న బిల్లుకు కీలక సమయంలో రాజ్‌భవన్‌ (Raj Bhavan) మోకాలడ్డటంపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహోదగ్రులవుతున్నారు. బిల్లుకు అడ్డుపడితే సహించేదిలేదని హెచ్చరించిన కార్మిక సంఘాలు.. గవర్నర్‌ తీరుకు నిరసనగా నేడు రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం అన్ని డిపోల ఎదుట కార్మికులు ధర్నాలు చేపట్టారు. ఉదయం 6 నుంచి 8గంటల వరకు బస్సులను నిలిపివేసి, తమ నిరసనను తెలియజేశారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్