34.2 C
Hyderabad
Monday, May 29, 2023

నేడు హైకోర్టులో కీలక విచారణ

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఉత్కంఠ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు నేడు కీలక విచారణ చేపట్టనుంది. నలుగురు టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్నది తెలంగాణ పోలీసు విభాగం ఆరోపణ. దీని మీద రాష్ట్ర పోలీసు శాఖ నుంచి ఏర్పాటైన సిట్ దూకుడుగా దర్యాప్తు చేపట్టింది. బీజేపీ సంఘటన కార్యదర్శి బీ ఎల్ సంతోష్ కు నోటీసులు ఇచ్చేదాకా మ్యాటర్ వెళ్లింది. ఈ లోగా సిట్ దర్యాప్తు కి హైకోర్టు సింగిల్ జడ్జి బ్రేకులు వేశారు. కేసు దర్యాప్తును సీబీఐ కు అప్పగించారు. డివిజన్ బెంచ్ కూడా ఇదే అభిప్రాయాన్ని బలపరిచింది.

దీని మీద తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటీషన్ దాఖలు చేసింది. సిట్ దర్యాప్తుని అడ్డుకోవటం సరికాదని ఇప్పటికే ప్రభుత్వం వాదనలు వినిపించింది. దీని మీద ప్రతివాదుల వాదనలు ఈ రోజు హైకోర్టు వినబోతోంది. 2014 నుంచి పెద్ద ఎత్తున టీ ఆర్ ఎస్ లో ఎమ్మెల్యేల చేరికను ప్రతివాదులు ప్రస్తావిస్తున్నారు. దీంతో ఈ కేసు తీర్పుతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కబోతున్నాయి.

Latest Articles

కర్ణాటకలో మంత్రులకు శాఖలు కేటాయించిన ప్రభుత్వం

స్వతంత్ర, వెబ్ డెస్క్: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించింది. మంత్రిత్వ శాఖల కేటాయింపులపై నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీఎం సిద్ధరామయ్య ఆర్థిక శాఖతో పాటు కేబినెట్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్