33.2 C
Hyderabad
Monday, June 5, 2023

తమిళనాడులో భగ్గుమన్న విభేదాలు…అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్.!

ద్రవిడ వాదానికి సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రసంగ పాఠంలో కొన్నిపేరాల్ని దాటించేసిన గవర్నర్‌ రవి

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీలదే అక్కడ హవా. తాజాగా డీఎంకే ప్రభుత్వం తనదైన శైలిలో దూసుకొని వెళుతోంది. ఈ క్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవికి, స్టాలిన్‌ ప్రభుత్వానికి ఏ మాత్రం పొసగటం లేదు.

తమిళనాడు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమయంలో ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగాన్ని గవర్నర్ చదవటం ఆనవాయితీ. గవర్నరుగా ప్రసంగాన్ని మొదలు పెట్టిన రవి.. కొన్ని పేరాల్ని దాటించేసి ముందుకు వెళ్లారు. దీనికి అభ్యంతరం చెప్పిన ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు అసెంబ్లీ రికార్డుల్లోకి తమ ప్రసంగపాఠమే వెళ్లాలని డిమాండ్ చేశారు. ద్రవిడ వాదానికి సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు ఉండటంతో వాటిని దాటించేసినట్లు గవర్నర్ వర్గం చెబుతోంది. ఈ లోగా గడబిడ చెలరేగటంతో గవర్నర్ రవి…అక్కడ నుంచి వెళ్లిపోయారు.

మొత్తంగా చూస్తే..అసెంబ్లీ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేయటం విన్నాం, చూశాం కానీ, గవర్నర్ వాకౌట్ చేయటం మాత్రం విడ్డూరంగా నిలిచింది.

Latest Articles

రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు దుర్మరణం

స్వతంత్ర, వెబ్ డెస్క్: కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు కొల్లం సుధి దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వటకరలోని ఓ కార్యక్రమానికి హాజరై కారులో తిరిగి వస్తుండగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్