29.2 C
Hyderabad
Monday, May 29, 2023

కరీంనగర్‌ గడ్డ.. బీజేపీకి అడ్డా..!- ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభలో బండి సంజయ్

  • ధర్మం కోసం యుద్ధం చేస్తామన్న బీజేపీ చీఫ్‌
  • నన్ను ఎన్నో అవమానాలకు గురి చేశారని ఆవేదన
  • బీఆర్‌ఎస్‌ ఏర్పాటుతో తెలంగాణకు పీడా విరగడైందని సెటైర్‌

కరీంనగర్‌: కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అని..కార్యకర్తల కష్టం వల్లే తాను ఎంపీగా గెలిచానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ గడ్డ తనకెంతో ఇచ్చిందన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. కరీంనగర్ లో జరిగిన ప్రజాసంగ్రామయాత్ర ముగింపుసభలో ఆయన భావోద్వేగంతో మాట్లాడారు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోతే కార్యకర్తలు ఏడ్చారని.. దానిపై దేశం అంతా చర్చ జరిగిందన్నారు. అవమానాలకు తాను భయపడనని చెప్పారు. గులాబీజెండాతో అపవిత్రమైన తెలంగాణను కాషాయజెండాతో పవిత్రం చేయమని, తనకు జాతీయ నాయకత్వం సూచించిందని తెలిపారు. అందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.

Latest Articles

18ఏళ్ళు నిండి రీల్స్ చేసే వారికి తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్..

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో నడుస్తున్న ట్రెండ్ రీల్స్. కూర్చున్నా.. నిలబడినా.. తుమ్మినా.. దగ్గినా.. ఏం చేసినా వీడియో తీసి.. దానికి కాస్త బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జోడించి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్