23 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

కాంగ్రెస్ ఆశావహుల అర్జీలకు నేడే ఆఖరు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే ప్రచారం షురూ చేసింది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఆశావహులు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ వేగవంతం అయింది. ఆశావహుల అర్జీలకు నేడే ఆఖరు కావడంతో ఇవాళ పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన 723 దరఖాస్తులు వచ్చాయని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

 

ఇవాళ చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఒక్క ఇల్లందు నియోజకవర్గ టికెట్ కోసమే 36 మంది ఆశావ హులు అర్జీ పెట్టుకున్నారని చెప్పారు. ఇవాళ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత రేపటి నుంచి పరిశీలన జరగనుంది. ఇప్పటికే రేవంత్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నాల, షబ్బీర్ అలీ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇవాళ ంభట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, సీతక్క జగ్గారెడ్డి తదితర కీలక నేతలు దరఖాస్తు చేసుకోనున్నారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్