వరుసగా రెండు మ్యాచులను ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ హోం గ్రౌండ్ లో మరో పోరుకు సిద్దమైంది. ఈ సీజన్లో టాప్ వన్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ టీమ్ పోటీ పడనుంది. ఐపీఎల్ చరిత్రలో రికార్డులను సృష్టించిన సన్ రైజర్స్, రాజస్థాన్ మీద గెలిచి వరుస ఓటములకు బ్రేక్ వేయాలని చూస్తోంది. ఈ రోజు సాయంత్రం జరిగే మ్యాచ్ కోసం రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్, రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ రెడీ అయ్యారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రికెట్ ఫ్యాన్స్ హైదరా బాద్ లో జరిగే మ్యాచులను ఎంజాయ్ చేస్తున్నారు.