BJP Parliament Prawas Yojana meeting | హైదరాబాద్లో నేడు బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజన సమావేశం జరగనుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షత వహించనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలపై విజయం సాదించేందుకు పార్టీ సంస్థాగత బలోపేతం, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీలో చేరికలు. అమిత్ షా పర్యటన పాటుగా మరికొన్ని అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జీ సునీల్ బన్సల్ హాజరుకానున్నారు. పార్లమెంట్ కన్వీనర్, ప్రభారీ, జిల్లా అధ్యక్షులు, ఇంచార్జీలతో సునీల్ బన్సల్ సమావేశం కానున్నారు.