స్వతంత్ర, వెబ్ డెస్క్: మణిపూర్ లో అమిత్ షా పర్యటన మూడవరోజు కొనసాగుతుంది. మణిపూర్, మొరెహ్ లో భద్రతా చర్యలపై సీనియర్ అధికారులతో కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. అనంతరం మైటీస్ రిలీఫ్ క్యాంప్ లో ఉన్న బాధితులను పరామర్శించి, వసతి ఏర్పాట్లు ఎలా వున్నాయో మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవద్దని బాధితులకు ధైర్యం చెప్పారు. త్వరలోనే మణిపూర్ లో సాధారణ పరిస్థితులు వస్తాయని.. శాంతీయుత వాతావరణం ఉంటుందని తెలిపారు.