గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఫ్లెక్సీల రగడ నెలకొంది. మున్సిపల్ ఆఫీసులోకి వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. మున్సిపాల్టీకి టాక్స్ కట్టి, పెట్టుకున్న తమ బ్యానర్లపై వైసీపీ ఫ్లెక్సీలు బ్యానర్లు అంటించడమేంటని ప్రశ్నించారు. వైసీపీ నేతలు తమ ఫ్లెక్సీలను అక్రమంగా తొలగించారంటూ టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ నిరసన వ్యక్తం చేశారు. మునిసిపల్ ఆఫీసులోకి వెళ్లి, టీడీపీ తూర్పు నేతలు ఫిర్యాదు చేశారు.


