కృష్ణాజిల్లాలో హోం ఓటింగ్ కు దరఖాస్తు చేసుకున్న వృద్ధులు, దివ్యాంగుల ఓటింగ్ ప్రక్రియ నేడు మొదలైందిన ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీ రావు పేర్కొన్నారు. జిల్లాలో 442 మంది దివ్యాం గులు, ,1052 మందికి పైగా వృద్ధులుహోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారిలో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలోనే 332 మంది ఉన్నారు.హోమ్ ఓటింగ్ ప్రక్రియలో మొత్తం ఐదుగురు టీం ఉంటారు ఒక పోలింగ్ అధికారి, వారి అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్, ఒక వీడియో గ్రాఫర్, ఒక పోలీస్ అధికారి ఈ టీంలో ఉంటారు, ఎన్టీఆర్ జిల్లాలో వంద సంవత్సరాలు నిండిన వృద్ధులు 25 మంది వరకు ఉన్నారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియ ఏపీలో ప్రారంభించడం ఇదే ప్రథమం. ఫిబ్రవరి 22వ తారీకు లోపు అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ అవకాశం ఉంటుందని ఢిల్లీ రావు తెలిపారు. మిగతావారు మే 13న పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.