స్వతంత్ర, వెబ్ డెస్క్: గుడికి వచ్చిన వారికి భక్తి భావాలు పెంపొందించాల్సిన ఓ పూజారి రతి పాఠాలకు తెరదీశాడు. ఫలితంగా కటకటాల పాలయ్యాడు. హైదరాబాద్లోని సరూర్ నగర్ ప్రాంతానికి చెందిన వెంకట సాయికృష్ణ స్థానికంగా ఓ గుడిలో పుజారిగా పనిచేస్తున్నాడు. ఇతడికి బంధువైన అప్సర అనే యువతితో వివాహేతర సబంధం ఏర్పడింది. అయితే సాయికృష్ణకు ఇదివరకే వివాహమై.. ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని అప్సర అతడిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు పూజారి.
కారులో శంషాబాద్లోని సుల్తాన్పల్లికి అప్సరను తీసుకువెళ్లాడు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సాయికృష్ణ.. ఆమె తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం తన కారులోనే ఆమె మృతదేహాన్ని సరూర్నగర్కు తీసుకువచ్చి మ్యాన్హోల్లో పడేశాడు. తర్వాత ఏమీ తెలియనట్లు తన బంధువు అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సాయి సెల్ఫోన్ సిగ్నల్స్తో పాటు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని మృతదేహం కోసం మ్యాన్ హోల్లో గాలిస్తున్నారు.