ఏపీలో ఇటీవల జరిగిన పోలింగ్ వేళ పలు ప్రాంతాల్లో అల్లర్లు చోటుచేసున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పలు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగాయి. ఈ అల్లర్ల వెనక కారణాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. రాయలసీమలోని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ వాళ్లు దాడి చేశారంటూ నిన్నా మొన్నటి వరకు అనుకున్నారు. అయితే ఇరుపార్టీల మధ్య జరిగిన గొడవల్లో వైఎస్ఆర్సీపీ వారు టీడీపి మీద, టీడీపీ వారి మీద వైఎస్ఆర్సీపీ వాళ్లు దాడి చేసి ఉండొచ్చని భావించారు. కానీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి, తలుపులు పగలగొట్టింది పోలీసులేనని తేలడంతో ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది.
ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఎన్నికల వేళ చెదురుమదురుగా పలుచోట్ల అల్లర్లు చోటు చేసుకు న్నాయి. ఇరు వర్గాల ఘర్షణలు పోలింగ్ రోజుతో ముగిసాయనుకుంటే మరసటి రోజు కూడా అల్లర్లు కొనసాగాయి. ఈ ఘర్షణలపై ఈసీ కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తుకు ఆదేశిం చింది ఈసీ. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి వచ్చిన వందల మంది పోలీసులు. ఆయన ఇంటి తలుపులు పగలగొట్టారు. ఇంట్లో వైసీపీ కార్యక ర్తలు ఉన్నారనే సమాచారంలో ఇలా చేసి ఉండొచ్చని అందరూ భావించారు. అయితే సీసీ కెమెరాలను ఎందుకు ధ్వంసం చేశారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. పెద్దారెడ్డి ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు. తమ లాఠీలతో పగలగొట్టిన విజువల్స్ లభించాయి.దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ వార్త సంచలనంగా మారింది. భద్రతలో బాగంగా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను పోలీసులు ఎందుకు పగులకొట్టాల్సి వచ్చింది. సీసీ కెమెరాలు పోలీసులే పగులకొట్టిడం వెనుక అసలు కారణాలు ఏమిటి ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీంతో రాయలసీమలో అల్లర్లకు పోలీసులే కారణం అనే టాక్. ఈ వీడియో తర్వాత బలంగా వినిపిస్తోంది.
పెద్దారెడ్డి ఇంటిపై దాడులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దారెడ్డి సీసీ కెమెరా విజువల్స్ ను, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించటంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. పోలింగ్ జరుగుతున్న మే 13వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా అల్లర్లు మొదలయ్యాయి. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత విధ్వంసం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి టార్గెట్ గా పోలీసులే రౌడీల్లా వ్యవహరించారని, పోలీసుల కనుసన్నల్లోనే రాయలసీమలో అల్లర్లు చెలరేగాయంటూ బయటకు వచ్చిన సీసీ కెమెరా వీడియోలే సాక్ష్యంగా వైసీపీ ఆరోపిస్తుంది. ఇంటి తలుపులు అయితే పగలగొట్టారు అంత వరకు ఓకే. పోలీసులు సీసీ కెమెరాలను ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది అనే ప్రశ్నలపైనే ఇప్పుడు ఈసీ సైతం విచారణ చేయబోతుంది. పల్నాడు, సీమలో అల్లర్లపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది ఎన్నికల సంఘం. సిట్ విచారణలో పోలీసుల వ్యవహారంపై మరిన్ని ఆధారాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్పిం చనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసుల దాడి విజువల్స్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నా యి.మరి పోలీసులు ఈ దాడులకు పాల్పడడానికి కారణాలు ఏంటనే సిట్ దర్యాప్తులో తేలాల్సి ఉంది.