2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేకు ఇండియా కూటమి టఫ్ ఫైట్ ఇచ్చింది. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన ఎన్డీయే ఈ ఎన్నికల్లో హవా తగ్గింది. ఈసారి ఇండియా కూటమి ఎన్డీయేకు ధీటుగా నిలబడింది. ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం ఎన్డీఏ 291 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. బీజేపీ సొంతంగా 237 స్థానాల్లో లీడ్లో ఉంది. 2019 ఫలితాలతో పోలిస్తే బీజేపీ 66 పార్లమెంట్ స్థానాల్లో వెనుకంజలో ఉండగా.. ఇండియా కూటమి 234 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 97 స్థానాల్లో లీడ్లో ఉంది. 2019 ఎన్నికలతో పోలిస్తే 45 స్థానాల్లో పుంజుకుని ముందంజలో ఉంది. వారణాసిలో ప్రధాని మోదీ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాయనాడ్, రాయ్బరేలీలో భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అమేథీలో స్మృతీ ఇరానీ వెనుకంజలో ఉన్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు విజయం సాధించారు.


