లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కోసం అభ్యర్థిని ప్రకటించారు. హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. దీంతో, తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన జరిగింది. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేశారు.
హైదరాబాద్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, నాగర్కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మెదక్- వెంకట్రామిరెడ్డి, మహబూబ్నగర్ – మన్నె శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. అలాగే కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, హీరాబాద్- గాలి అనిల్ కుమార్, ఖమ్మం- నామా నాగేశ్వర్ రావు, చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మహబూబాబాద్ – మాలోత్ కవిత, మల్కాజ్గిరి – రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్- ఆత్రం సక్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, వరంగల్ నుంచి కడియం కావ్య బరిలో ఉన్నారు . అలాగే సికింద్రాబాద్- పద్మారావుగౌడ్ , కరీంనగర్- బోయినపల్లి వినోద్ కుమార్, నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీకి దిగుతున్నారు.


