స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ లో భారీ మార్పులు జరుగనున్నట్లు తెలుస్తోంది. టీబీజేపీ అధ్యక్షురాలుగా డీకే అరుణకు అవకాశం ఇవ్వనున్నారు. అలాగే ప్రచార కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ను, కేంద్ర మంత్రిగా బండి సంజయ్? కు అవకాశం కల్పించనున్నారు. వీరి ముగ్గురి భద్రత పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంభందించి నేడో రేపో అధికారిక ప్రకటన రానుంది.