స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ గవర్నర్ తమిళసైకీ ట్రాఫిక్ సమస్యలు తప్పలేదు. గవర్నర్ ప్రయాణిస్తున్న వాహనం హెవీ ట్రాఫిక్లో నిలిచిపోయింది. సోమవారం సాయంత్రం గవర్నర్ ఖైరతాబాద్లోని హనుమాన్ ఆలయానికి వచ్చిన సందర్భంగా ఆమె కాన్వాయ్ కాసేపు ట్రాఫిక్లో చిక్కుకుపోవాల్సి వచ్చింది. ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్కు వచ్చిన గవర్నర్ తిరుగు ప్రయాణంలో రాజ్భవన్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సోమాజిగూడ వద్ద యూటర్న్ తీసుకునే సమయంలో కాన్వాయ్ నిలిచిపోయింది. ఎర్రమంజిల్ నుంచి ఖైరతాబాద్ వెళ్లే మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో వెంటనే కాన్వాయ్కు యూటర్న్ తీసుకోవడం కుదరలేదు. ఖైరతాబాద్, ఎర్రమంజిల్ మార్గంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతోనే ఇట్లా జరిగిందని తెలుస్తోంది. కాగా, గవర్నర్ భద్రతా సిబ్బంది ట్రాఫిక్ని కంట్రోల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. యూటర్న్ వద్ద వాహనాలను కొద్దిసేపు నిలిపివేయడంతో కాన్వాయ్ ముందుకు కదిలింది.
గవర్నర్కి తప్పని ట్రాఫిక్ ఇక్కట్లు..
Latest Articles
- Advertisement -