ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్, అడుసు తొక్కనేల, కాలు కడగనేల ఇలా నీతి సూత్రాలు ఏ భాషలో, ఎవరు చెప్పినా, ఆ మంచిని ఆచరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఈ జాగ్రత్తలు సైబర్ నేరాల విషయంలో మరింత తీసుకోవాల్సివుంది. సైబర్ నేరగాళ్ల కహానీలు, బెదిరింపులపై అప్రమత్తంగా ఉండా లి. ఎందుకంటే సైబర్ మోసగాళ్లను పట్టుకోవడం పోలీసులకు చాలా కష్టతరంగా ఉంది. తాజాగా హైదరా బాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి సైబర్ మోసగాళ్ల వలకు చిక్కినా కథ సుఖాంతం అవ్వడం అదృష్టం.
సైబర్ నేరగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. సెల్ ఫోన్ కాల్స్, ఐస్ చేసే మాటలు, మోసగించే నేరగాళ్లు, బుట్టలో పడే బాధితులు ఇటీవల జరుగుతున్న సైబర్ మోసాలన్నీ ఈ రీతన సాగుతున్నాయి. సైబర్ నేరగాళ్ల ట్రాప్ లో పడిన బాధితుడు లోన్ తీసుకొచ్చి మరీ మాయగాళ్ల బ్యాంక్ ఖాతాల్లో వేసి మోసపోయా డు. హైదరాబాద్ అంబర్ పేట్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఈ నెల 27 న గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆధార్ కార్డు నెంబర్ చెప్పి మరీ మోసానికి తెర లేపాడు. నిందితుడి కహానీతో సాఫ్ట్వేర్ ఉద్యోగి గందరగోళానికి గురయ్యాడు.
సైబర్ మోసగాడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఫోన్ చేసి, మీ ఆధార్ నెంబరుతో ఓ డ్రగ్ పార్శిల్ ముంబాయి నుంచి ఇరాన్కు వెళ్తోంది. దానిని ఫెడ్ ఎక్స్ కొరియర్ ద్వారా పంపిస్తున్నారు. వాటిని ముంబాయి పోలీసు లు సీజ్ చేశారు అని సైబర్ కేటుగాడు పాపం ఆ ఉద్యోగిని తెగ బెదరగొట్టేశాడు. ఇప్పుడు మీ పేరు మీద కేసు నమోదైంది. ముంబయి పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపెట్టేశారు. వెంటనే మీరు స్కైప్ కాల్ లోకి వస్తే మిమ్మల్ని విచారించాల్సి ఉందని ఉక్కిరిబిక్కిరి చేశారు. స్కైప్ కాల్ లో మాట్లాడు తూనే నేరగాళ్లు కహానీలు మొదలెట్టారు. తాము తెలిపిన సొమ్మును మీ ఖాత నుంచి మాకు ట్రాన్సఫ్ ర్ చేస్తే, పరిశీలిన అనంతరం తిరిగి మీకు పంపిస్తామని ఏవో పొంతన లేని మాటలు చెప్పారు. అయితే, అప్పటికే అయోమయానికి గురైన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ముందు వెనుకలు ఆలోచించకుండా వాళ్లు చెప్పినట్టు చేసేశాడు. లోన్ తీసుకొచ్చి మరీ నేరగాడి బ్యాంక్ ఖాతాలో సొమ్ము వేసేశాడు. అయితే, చివరకు మోసం గ్రహించిన ఆ ఉద్యోగి ఈ నెల 27వ తేదీ సాయంత్రం సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా స్పందించారు. దీంతో, సాఫ్ట్ వేర్ ఉద్యోగి సేఫ్ జోన్ లో పడ్డాడు.
సీసీఎస్ సైబర్ క్రైమ్ ఎన్సీఆర్పీ పోర్టల్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్ చాకచక్యంగా పనిచేయడంతో ఈ కథ సుఖాంతం అయ్యింది. శ్రీకాంత్ నాయక్ సత్వర చర్యలతో కేవలం 11 నిమిషాల్లో 18 లక్షల రూపాయల సొమ్ము సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఆగింది. బ్యాంకు అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఖాతాలను స్తంభింప చేశారు.విషయం గ్రహించిన వెంటనే కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం ఎన్సీఆర్పీ పోర్టల్లో వివరాలను నమోదు చేసి సుమారు ఏడు గంటల సమయంలో బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాలకు వెళ్ళకుండా నిలిపేలా చేశాడు. ఇలా మొత్తం 11 నిమిషాల్లో 18 లక్షలు ఖాతాలోనే ఉండిపోవడం తో పోలీసులు, బాధితుడు ఊపిరి పీల్చుకున్నారు. వాటిని తిరిగి బాధితుడికి పోలీసులు ప్రక్రియ ద్వారా అందజేయనున్నారు. ఈ తరహా ఫోన్ కాల్స్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తు న్నారు. విచారణ, దర్యాప్తు వివరాల గురించి పోలీసులు ఎప్పుడూ ఫోన్ కాల్స్ చేయరని, నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేయమని వాట్సప్ లు, స్కైప్ కాల్స్ పోలీసులు చేయరని పోలీసుశాఖ ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. ఇలా ఎవరైనా ఫోన్స్ చేస్తే అది సైబర్ మోసగాళ్ల పనే అని గుర్తించుకోవాలని తెలిపారు. ఆ తరహా ఫోన్లకు ఆన్సర్ ఇవ్వవద్దని, వచ్చిన ఫోన్ నెంబరు వివరాలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. జీరో అవర్ ని ఉపయోగిం చుకోవాలని బాధితుల కు పోలీసులు సూచిస్తున్నారు.