స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రోజంతా ఆటుపోట్లు ఎదుర్కొని గురువారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 294.32 పాయింట్లు నష్టపోయి 62,848.64 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 91.85 పాయింట్ల నష్టంతో 18,634.55 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.58గా ఉంది. టీసీఎస్, హెచ్సీఎల్, విప్రో, ఐటీసీ, టాటా స్టీల్, ఏషియన్ పేయింట్స్, భారతీ ఎయిర్ టెల్, నెస్లే ఇండియా, టాటా మోటార్స్, మారుతీ, సన్ఫార్మా, టైటాన్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, పవర్ గ్రిడ్, ఎన్టీటీపీ, ఎల్అండ్టీ షేర్లు లాభపడ్డ జాబితాలో ఉన్నాయి.