స్వతంత్ర వెబ్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్లో క్వాలిఫయర్-2 మ్యాచ్లో గుజరాత్ ఓపెనర్ శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టాడు. దీంతో ఈ సీజన్లో 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా గిల్ ఘనత సాధించాడు. ముంబయితో జరుగుతున్న ఉత్కంఠ పోరులో 32 రన్స్ లో అర్ధశతకం చేసిన గిల్.. ఇంకాస్త దూకుడు పెంచి మరో 17 బంతుల్లోనే శతకం బాదాడు. 8 సిక్స్లు, 4 ఫోర్లతో ముంబయి బౌలర్లపై తన ప్రతాపం చూపాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ఒక వికెట్ నష్టానికి 148 పరుగులు చేసింది. క్రీజులో గిల్తో పాటు సాయి సుదర్శన్ (27*) ఉన్నాడు.