కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తి నేని వీరయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిభా అనేది ఎవరి సొత్తు కాదని.. వైకల్యాలు, శక్తి సామర్థ్యాలు మేధోశక్తి పై ప్రభావం చూపవన్నారు. ఓ ఐఎఎస్ అధికారి వికలాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తన స్థాయిని దిగజారుస్తోందని ముత్తినేని వీరయ్య తెలిపారు. బ్రెయిలీ లిపిని అందించిన లూయీస్ బ్రెయిలీ మొదలుకుని, అనేక మంది సివిల్ సర్వెంట్లు, రాజకీయవేత్తలు, డాక్టర్లు వారి వారి రంగాల్లో తమ శక్తి సామర్థ్యాలను చాటారన్నారు. దివ్యాంగుల మనోభావాలను దెబ్బతినేలా చేసిన ఈ వ్యాఖ్యలను స్మితాసబర్వాల్ వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ముత్తినేని వీరయ్య డిమాండ్ చేశారు.


