స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు శరద్ పవార్ ప్రకటించారు. సహచరులు, పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తానని తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు రాజీనామా నిర్ణయం ఉపసంహరించుకుంటున్నట్నలు తెలిపారు. ఇక నుంచి నూతనోత్సాహంతో పార్టీ అధినేతగా కొనసాగుతానని స్పష్టం చేశారు. పవార్ రాజీనామాను పార్టీ నియమించిన కమిటీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. తన జీవిత చరిత్రపై మరాఠీలో రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో కార్యకర్తలు, నేతలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కాగా 1999లో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో విభేదించి ఆయన ఎన్సీపీని స్థాపించారు. అప్పటి నుంచి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకున్న శరద్ పవార్
0
452
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


