మీడియా మొఘల్, ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతితో స్వగ్రామం కృష్ణా జిల్లా పెదపారు పూడిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెదపారుపూడి గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయా రు. తాను దత్తత తీసుకుని తమ గ్రామాన్ని సొంతనిధులతో అభివృద్ధి చేశారని గ్రామస్థులు తెలిపారు. విద్యార్థి దశ నుంచే రామోజీరావుకు కష్టపడేతత్వం ఉండేదని, దేశంలో గొప్ప స్థాయికి చేరుకున్నా పుట్టిన గ్రామాన్ని మాత్రం మర్చిపోకుండా ఆయన సేవలు చేశారని తెలిపారు. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పెదపారుపూడిని మోడల్ గ్రామంగా రామోజీరావు తీర్చిదిద్దారని చెప్పుకొచ్చారు.


