35.2 C
Hyderabad
Friday, May 9, 2025
spot_img

ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురు మృతి

స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మృతుల్లో ముగ్గురు మహిళలు ఉండగా, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు.ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

విజయవాడకు చెందిన కొందరు కారులో తిరుమలకు వెళ్లారు. అక్కడి నుంచి శ్రీ కాళహస్తికి బయలుదేరారు. ఆ సమయంలో మిట్ట కండ్రిగ దగ్గర కారు.. ముందుగా ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అవగా.. అందులోని ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతి వేగమే ప్రమాదానికి కారణం అని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్