24.1 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

వైసీసీ నేతలకు టీడీపీ సీనియర్ నేత యనమల కౌంటర్

తాము అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాలను సాక్షి వక్రీకరించిందని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. సాక్షితో పాటు వారి అనుబంధ మీడియా సంస్థలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని అన్నారు. జగన్‌తో పాటు సాక్షి, అనుబంధ మీడియా సంస్థలు సభా హక్కుల కమిటీ నోటీసులు ఎదుర్కోకతప్పదని యనమల స్పష్టం చేశారు. సభా హక్కుల కమిటీ ఏర్పాటవగానే, శ్వేతపత్రాల్లోని అంశాలను వక్రీకరించిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు.

రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని వైసీపీ నేతలు తమ జేబుల్లో నింపుకున్నారన్నది వాస్తవం అని యనమల పేర్కొన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలన అనంతరం ఇప్పుడు రాష్ట్రానికి లక్షల కోట్లలో అప్పులు మిగిలాయని వ్యాఖ్యానించారు. వాస్తవాలతో శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్