25.2 C
Hyderabad
Sunday, June 1, 2025
spot_img

ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం ఆదేశాన్ని పాటించిన ఎస్బీఐ

     ఎలక్టోరల్ బాండ్ లకు సంబంధించిన డేటాను తగిన సమయంలో ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందని ప్రధాన ఎన్నిక ల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని గతంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా బ్యాంకు షేర్ చేసిన వివరాలను అధికారిక వెబ్ సైట్ లో ప్రచురిం చాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఎన్నికల కమిషన్ పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తుందని.. ఎస్ బీఐ సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారం తమకు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన డేటా అందజేసిందని.. దానిని తాము సకాలంలో వెల్లడిస్తామని ఈసీఈ వివరించారు. జమ్ముకశ్మీర్ లో ఎన్నికల సన్నాహాలను సమీక్షించిన అనంతరం శ్రీనగర్ లో విలేక రుల సమావేశంలో సీఈసీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకు మొత్తం 22,217 బాండ్లను కొనుగోలు చేశారని ఎస్ బీఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో తెలిపింది. ఇదే వివరాలను ఎన్నికల కమిషన్ కు ఎస్ బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్