తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. అందరినీ ఆలోచింప చేసే వీడియోలను షేర్ చేస్తూ తనదైన స్టైల్లో ట్వీట్ చేస్తారు. తాజాగా ఓ యువకుడు నడిరోడ్డుపై కారులో వెళ్తూ స్టంట్లు చేశాడు. అది వీడియోను కాస్త పోస్ట్ చేస్తూ మండిపడ్డారు. తలకెక్కిన వెర్రితో ఇటువంటి పనులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి పిచ్చి వారికి ఆనందం. కొందరికి వేపకాయంత వెర్రి ఉంటే, మరికొందరికి తాటికాయంత ఉంటుంది. ఇంకొందరికి పనసకాయంత ఉంటుందంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తిది ఏం వెర్రో మీరే చెప్పండంటూ సజ్జనార్ పేర్కొన్నారు. సజ్జనార్ అడిగిన ప్రశ్నకు నెటిజన్లు ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు. కాగా, ఈ ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.


