తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్ప్రదేశ్ బయల్దేరి వెళ్లారు. రాయ్ బరేలీ వెళ్తున్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. హైదరాబాద్ బేగంపేట్ లో ఆగారు. ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఇద్దరూ కలిసి ఒకే విమానంలో రాయ్ బరేలి వెళ్లారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరుకాబోతున్నారు. కాసేపట్లో బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో యూపీ కి బయల్దేరతారు. రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు రేవంత్.


