38.7 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

ప్రతి ఒక్కరు తన సొంత కథగా ఫీల్ అయ్యే చిత్రం ‘బేబీ’

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలు కలిసి నటించిన మూవీ బేబీ. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనే సినిమా రాబోతోంది. ఇక ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. జూలై 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్ తన పుట్టిన రోజు సందర్భంగా బేబీ విశేషాలను పంచుకున్నారు.

ఈ సినిమాలో ఇది వరకు చూడని సీన్లు చాలానే ఉన్నాయని.. వాటిని దర్శకుడు తీర్దిదిన తీరు ప్రేక్షకుడికి కచ్చితంగా నచ్చుతుందని ఎస్‌కేఎన్ తెలిపారు. ఈ సినిమా హై ఇంటెన్స్ ఎమోషనల్ ప్రేమ కథ. సంగీతం కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి చిత్రాలలో బెస్ట్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ముగ్గురు మధ్య జరిగే సీన్లలో కొత్త అప్రోచ్ ఉంటుంది. ఇంటర్వెల్ ముందు పెద్ద షాక్ ఉంటుంది. ఈ షాక్ నచ్చే సినిమాను నేను చేయాలని ఫిక్స్ అయ్యా. విజయ్ దేవరకొండతో ట్యాక్సీవాలా చేస్తున్నప్పుడే సాయి రాజేష్ కథ చెప్పాడు. అప్పుడే నా తరువాతి సినిమా ఇదే అని చెప్పా. సినిమాలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. పరిస్థితులను బట్టి పాత్రలు ప్రతిస్పందించే తీరుతోనే డైలాగ్స్ ఉంటాయి. నేను చేసే సినిమాలలో మ్యూజిక్ ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందరూ తెలుగువాళ్లే పని చేశారు. మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌, సింగర్లు అంతా తెలుగు వాళ్లే. అంతా తెలుగుదనమే ఉంటుంది. సినిమా విడుదలకు ముందే క్రేజ్ ఉందంటే.. విజయ్ కంపోజ్ చేసిన పాటలే కారణం.

పోస్టర్ సరిగా కంపోజింగ్ అవ్వకపోవడంతో ట్విటర్‌లో డిలీట్ చేశా. ముందు వేరే పోస్టర్ అనుకున్నాం. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో వర్టికల్ పోస్టర్ అయితేనే అక్కడి నుంచి తీయగలరని అన్నారు. దీంతో ముందు అనుకున్న పోస్టర్ కాకుండా మరో పోస్టర్ రిలీజ్ చేశాం. అయితే అనుకున్న విధంగా రాలేదు. దీంతో వెంటనే డిలీట్ చేశా. అందరూ కాల్ ఆఫ్ చేయకండి.. అలానే పెడితేనే మీకు పబ్లిసిటీ అని చెప్పారు. పబ్లిసిటీ కంటెంట్ నుంచి రావాలి.. కాంట్రవర్సీ నుంచి కాదని నమ్మే వ్యక్తి నేను. ఇప్పటికే సాంగ్స్ క్లిక్ అవ్వడంతో సినిమాపై మంచి బజ్ ఉంది.

నా జీవితంలో అన్ని లవ్‌ ఫెయిల్యూర్స్. అందుకే ఎక్కువ ప్రేమ కథ సినిమాలు చూస్తుంటా. నాకు రెండేళ్లు ఒకే సినిమాతో ఆ సెట్‌లో ఉండడం అలవాటు. ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలు తీయాలని అనుకుంటున్నా. కరోనా టైమ్‌లో ఓకే చేసిన కథలన్నీ ఇక నుంచి రాబోతున్నాయి. రెండు సినియాలు థియేటర్లో.. ఒకటి వెబ్‌లో ఉండాలని ఫిక్స్ చేసుకున్నా. నాక్ సైన్స్ ఫిక్షన్, హర్రర్, సూపర్ నేచురాల్ ఈ జోనర్ ఇష్టం. అయితే అన్ని అవే చేస్తే కథలు తక్కువగా ఉంటాయని అన్నీ చేస్తున్నాం. భవిష్యత్‌లో డైరెక్షన్‌ జోలికి వెళ్లను. చాలా మంది దర్శకత్వం వహించమని సలహాలు ఇచ్చారు. వంటలో ఉప్పు వేసినంత మాత్రానా.. వంట వస్తుందో రాదో తెలియక ఆగిపోయాను. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది. అయితే సినిమాకు కాకుండా వెబ్‌ కోసం చేస్తాం. సాయి రాజేష్‌తో రెండు సినిమాలు, కలర్‌ ఫోటో డైరెక్టర్‌తో రెండు సినిమాలు, వీఏ ఆనంద్‌ గారితో ఒక సినిమా, శ్యామ్ సింగరాయ్ దర్శకుడు రాహుల్‌తో మరో సినిమా చేస్తా. హీరోలకు చెబుతున్నాం. త్వరలో అనౌన్స్‌మెంట్ ఉంటుంది.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్