భారత ప్రధాని మోదీ రష్యా పర్యటన ఖరారైంది. మాస్కో అధ్యక్షతన వచ్చే వారంలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో మోదీ పాల్గోనున్నారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. రష్యాలోని కజన్ వేదికగా ఈ నెల 22 నుంచి 24 వరకు 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరవ్వాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా మోదీని ఆహ్వానించారు. అందులో భాగంగానే ఈనెల 22 నుంచి 23 వరకు మోదీ రష్యాలో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ సందర్భంగా బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని వెల్లడించింది. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరవుతారని ఆ దేశ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి హువా చున్యింగ్ తెలిపారు.
ప్రధాని మోదీ రష్యా పర్యటన ఖరారు
0
200
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


