17.7 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

సద్గురు జగ్గీ వాసుదేవ్ ను పరామర్శించిన ప్రధాని మోదీ

ఆధ్యాత్మికవేత్త, ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్‌ సర్జరీ జరిగింది. గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయన మార్చి 14న న్యూఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు స్కానింగ్‌లు నిర్వహించిన వైద్యులు ఆయన తలలో రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. మార్చి 17న ఆయనకు సర్జరీ చేశారు. ఇప్పుడాయన వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు.

ఆస్పత్రిలో కోలుకుంటున్న సద్గురు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో హాస్యాత్మక ధోరణిలో ఒక వీడియోను విడుదల చేశారు. తన తలలో ఏదో వెతికేందుకు వైద్యులు తన తలను కోశారని, ఖాళీగా ఉండడంతో వెంటనే కుట్లు వేశారని చెప్పారు. ఆస్పత్రిలో ఉన్న సద్గురుకు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి పరామర్శించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్