విత్తనాలు అమ్మే షాపుల ముందు ధరల బోర్డులు పెట్టాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నకిలీ విత్తనాలు పట్టుబడితే క్రిమినల్ కేసులు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చే నకిలీ విత్తనాలకి అడ్డుకట్ట వేయడానికి చెక్ పోస్టు వద్ద తనిఖీలు పటిష్టం చేస్తామని చెప్పారు. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే నకిలీ విత్తనాలు అమ్మకాలు చేస్తే చట్ట ప్రచారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా జీడీసీసీ బ్యాంక్లో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తామని కేంద్రమంత్రి చెప్పారు.