37.7 C
Hyderabad
Saturday, March 15, 2025
spot_img

పవన్‌కల్యాణ్‌గారిపై అభిమానంతో రేపు విడుదల చేస్తున్నాం: సాయి సునీల్‌

యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులుగా పవన్‌ కల్యాణ్‌ వీరాభిమాని అయిన సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. ఏజీఈ క్రియేషన్స్‌. ఎస్‌2మెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌ నిర్మించిన ఈ చిత్రం పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ వేడుకలో హీరో అరవింద్‌ కృష్ణ, శివారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

అరవింద్‌ కృష్ణ మాట్లాడుతూ ‘‘యామిన్‌ రాజ్‌, నేను కలిసి ఓ సిరీస్‌ చేశాం. తను ప్రతిభ ఉన్న నటుడు. ఈ సినిమాలో కూడా చక్కని నటన కనబర్చి ఉంటాడని నమ్ముతున్నా. టైటిల్‌, ట్రైలర్‌ నాకు బాగా నచ్చాయి. ట్రైలర్‌ చూశాక టైటిల్‌కు, ట్రైలర్‌కు సంబంధం లేదే అన్నట్లు అనిపించింది. అయితే ఆ ట్విస్ట్‌ ఏంటనేది తెరపై చూస్తేనే తెలుస్తుంది. అజయ్‌ పట్నాయక్‌ అద్భుతమైన సంగీతం అందించారు. ఆర్‌పీ, పట్నాయక్‌, సునీత గారు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. అవుట్‌పుట్‌ నేను చూశా. చాలా థ్రిల్‌ అయ్యాను. ఎమోషన్స్‌ ఆకట్టుకున్నాయి. దర్శకుడు ప్రతిభకు నేను ఫిదా అయ్యాను. భవిష్యత్తులో ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నా’’ అని అన్నారు.

శివారెడ్డి మాట్లాడుతూ ‘‘సినిమా టైటిల్‌ పాజిటివ్‌గా ఉంది. సినిమాలో పాటలు ట్రైలర్‌ ఆకట్టుకునేలా అద్భుతంగా ఉన్నాయి. వినూత్న కథతో కొత్త టీమ్‌ చేసిన ఈ చిత్రం సక్సెస్‌ కావాలి’’ అని శివారెడ్డి చెప్పారు.

దర్శకుడు సాయి సునీల్‌ నిమ్మల మాట్లాడుతూ ‘‘ఎంతో కష్టపడితే దర్శకుడిగా నాకీ అవకాశం వచ్చింది. వారి కోసం కష్టపడి ఈ సినిమా చేశా. బ్లాక్‌బస్టర్‌ అయిందా లేదా అన్నది కాదు.. నిర్మాతకు డబ్బులు వస్తే అదే పెద్ద సక్సెస్‌. కొత్త జానర్‌ కథతో సినిమా చేశారు. నా టీమ్‌ ఎంతో కష్టపడ్డారు. పవన్‌కల్యాణ్‌ గారి మీదున్న అభిమానంతో ఆయన పుట్టినరోజున సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు.

హీరోయిన్‌ ప్రియాంక మాట్లాడుతూ ‘‘సినిమాకు కథే ప్రాణం. దర్శకుడు బలమైన ప్రేమకథతో ఈ సినిమా తీశారు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌, లవ్‌, డ్రామా అన్ని ఉన్నాయి. హీరోయిన్‌గా నా తొలి చిత్రమిది. హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.

యామిన్‌ రాజ్‌ మాట్లాడుతూ ‘‘వ్యాపారం కోసం హైదరాబాద్‌ వచ్చిన నాకు హీరోగా అవకాశం వచ్చింది. మంచి టీమ్‌తో సినిమా చేశాం. నిర్మాతల సహకారం మరువలేనిది’’ అని అన్నారు.

నటీనటులు
మెహబూబ్‌ బాషా, హరికృష్ణ, యోగి కద్రి, రఘు, సునీత, మనోహర్‌, పవన్‌ ముత్యాల, రాజారెడ్డి, సందీప్‌, స్రవంతి, బండ సాయి, బక్క సాయి, ప్రత్యూష, గోపీనాయుడు.

సాంకేతిక నిపుణులు
కెమెరా: శివకుమార్‌ దేవరకొండ,
సంగీతం: అజయ్‌ పట్నాయక్‌,
ఎడిటర్‌: ఎం.ఆర్‌. వర్మ
పాటలు: కాసర్ల శ్యామ్‌, సాయి సునీల్‌ నిమ్మల, భాను–కృష్ణ,
సౌండ్‌ మిక్స్‌: జయంతన్‌ సురశ్‌
కొరియోగ్రఫీ: కపిల్‌, శ్రీవీర్‌
సౌండ్‌ ఎఫెక్ట్స్‌: పురుషోత్తం రాజు,
ఫైట్స్‌: శివ్‌రాజ్‌
డిఐ: వెంకట్‌
స్టిల్స్‌ జగన్‌
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: మహి
మేకప్‌: అనిల్‌, భాను
పీఆర్వో: మధు విఆర్‌
పబ్లిసిటీ డిజైనర్‌: ఎంకెఎస్‌ మనోజ్‌
పోస్ట్‌ ప్రొడక్షన్స్‌: సారథి స్టూడియోస్‌
నిర్మాతలు: ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌
రచన – దర్శకత్వం: సాయి సునీల్‌ నిమ్మల.

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్