24.9 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

వారణాశిలో ప్రధాని మోదీ పర్యటన

         పదేళ్లలో వారణాశి రూపురేఖలు అద్భుతంగా మారిపోయాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బనారస్ యూనివ ర్సిటీలో విద్యార్థులు, ఉపాధ్యాయులనుద్దేశించి ప్రసంగించారు. పదేళ్లలో ‘వికాస్ కీ గంగా’ కాశీని పెంచి పోషించిందని మీరంతా చూశారని అన్నారు. ఇదీ కాశీ సామర్థ్యం మహాదేవుని ఆశీస్సుల శక్తి అని పేర్కొన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇంతవరకూ సాధించిన అభివృ ద్ధిని ప్రధాని వివరించారు. వారణాశిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కి శంకుస్థాపన చేశారు. దీనివల్ల విద్య, శిక్షణ, మౌలిక రంగాల్లో అపూర్వ ప్రగతి సాధ్యం కాగలదని ప్రధాని అన్నారు. 13 వేల కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోది ప్రారంభిస్తున్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత ఆయన వారణాశి సందర్శించడం ఇది 43వ సారి. రాత్రే వారణాశి చేరుకున్న మోదీ ఈ మధ్య ప్రారంభించిన శివపూర్- పుల్వారియా- లహర్తరా మార్గాన్ని పరిశీలించారు. సంత్ గురు రవిదాస్ జన్మస్థలి సందర్శించి పూజలు చేసారు. సంత్ రవిదాస్ 647వ జయంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని సంత్ హరిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్