27.2 C
Hyderabad
Thursday, November 6, 2025
spot_img

జనం కసితో కాదు.. భయంతోనే ఓట్లు వేశారు – కిరణ్ రాయల్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు చూస్తే జనం కసితో కాదు.. భయంతోనే ఓట్లు వేశారని తిరుపతి జనసేన ఇన్‌చార్జ్‌ కిరణ్‌ రాయల్‌ అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్‌ చాలెంజ్ చేసి మరీ జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారని చెప్పారు. వైసీపీ నేతలు చేసిన పాపాలే ఆ పార్టీని ఓడించాయని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు. మంత్రి రోజా పాపాల ఫలితం కూడా వైసీపీ ఓటమికి కారణం అన్నారు. ఘోరంగా ఓడిపోయిన జగన్‌ క్యాబినెట్‌ అసోం వెళ్లేందుకు ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక రైలులో టికెట్లు కూడా బుక్ చేసినట్లు కిరణ్‌ రాయల్‌ ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే.. జగన్ ప్రమాణ స్వీకారానికి స్వాగత పోస్టర్లు వేస్తామని చెప్పామని, అయితే.. ఇప్పుడు ఆ అవసరం రాలేదన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్