స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మార్షల్ ఆర్ట్స్ లో సత్తా చాటుతున్న చిన్నారులు పడాలభవేశ్ రెడ్డి, కార్తికేయ రెడ్డి సోదరులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందించారు. తైక్వాండోలో శిక్షణ పొందుతూ యూరప్ దేశాల్లో పతకాలు సాధిస్తున్న తెలుగు చిన్నారుల గురించి తెలుసుకుని ఎంతో సంతోషించానని పవన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకు చెందిన పడాల సూర్యచంద్రారెడ్డి ఉద్యోగరీత్యా డెన్మార్క్ దేశంలో ఉంటున్నారని.. ఆయన కుమారులు భవేశ్, కార్తికేయలు డెన్మార్క్, బెల్జియం, జర్మనీల్లో నిర్వహించిన తైక్వాండో పోటీల్లో పతకాలు సాధించడం అభినందనీయమని తెలిపారు. ఈ సోదరులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
మార్షల్ ఆర్ట్స్ లో సత్తా చాటుతున్న చిన్నారులు భవేష్ రెడ్డి, కార్తికేయ రెడ్డి మరిన్ని విజయాలు అందుకోవాలి. pic.twitter.com/Kqwrvt5OiE
— JanaSena Party (@JanaSenaParty) May 7, 2023