Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

మేడిగడ్డ వివాదంలో జనం ఎవరి వైపు?

     తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల నడుమ జల వివాదానికి ఇప్పట్లో తెర పడేలా లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి బలమైన కారణంగా మారింది. మరో వైపు పోలింగ్ కి ఒక్క రోజు ముందే నాగార్జున సాగర్ డ్యాం ను ఆంధ్ర పోలీసులు ఆక్రమించుకుని పహారా ఏర్పాటు చేశారు. అదీ వివాదం అయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జల వివాదం కీ రోల్ పోషించే అవకాశం పక్కగా కనిపిస్తోంది. ఇంతకీ తెలంగాణ ప్రజలు మేడిగడ్డ విషయంలో ఎవరి వైపు నిలుస్తారు? ప్రాజెక్టుల వివాదాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ క్యాష్ చేసుకుం టుంది?

      తెలంగాణ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి వాటర్ వార్ కొనసాగుతోంది. కాళేశ్వరం అవినీతి మయంగా మారిందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తూ.. మేడిగడ్డను సందర్శిం చేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వెళ్ళారు. అయితే కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం… స్వయంగా ప్రభుత్వమే ప్రజా ప్రతినిధులను మేడిగడ్డ తీసుకెళ్లడం చూశాం. మరో వైపు కేసీఆర్ నల్గొండ సభ పెట్టి కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలని కాంగ్రెస్ చూస్తోందని, తెలంగాణ హక్కులను కాలరా స్తోందని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ పర్యటనకు వెళ్లి సందర్శించడంతో పాటు రైతులకు సాగునీటికి ఇబ్బందులు పడకుండా వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.

      కాళేశ్వరం లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు మీద కేంద్రం కమిటీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం.. ఇంతలో కాళేశ్వరం ప్రాజెక్టు పై కాగ్ నివేదికను అసెంబ్లీ లో ప్రవేశపెట్టడం చకచకా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని కోరినా, అందులో కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పగా మరో వైపు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచి వాలయంలో మాట్లాడుతూ ఆ సమాచారం నీటిపారుదల శాఖ అధికారుల వద్ద కూడా లేదని తేల్చి చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే అధికారులు కాళేశ్వరం విషయంలో ఎంత బాధ్యతా రాహిత్యం తో ఉన్నారో, నాటి రాష్ట్రప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందో స్పష్టంగా అర్థమవుతుంది అని ప్రతిపక్షా లు దుమ్మెత్తి పోస్తున్నాయి.

    ఇటీవల రాష్ట్రంలో నేసా నియమించిన కమిటీ బృందం చైర్మన్ గా సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ తో పాటు మరో నలుగురు సభ్యులు, నాలుగు రోజుల పాటు పర్యటించారు. మొదటి రోజు నీటి పారుదల శాఖ అధికారులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కమిటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అన్ని రకాలుగా సహకరిస్తామని, వీలైనంత త్వరగా తాత్కాలిక నివేదిక అందించాలని కోరారు. రెండు రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సందర్శించిన అనంతరం అధికారులతో భేటీ అయ్యారు. అధికారులు భేటీకి 19రకాల సమాచారం అందించాలని అందులో ప్రాజెక్టు నిర్మాణానికి ముందు జియోగ్రాఫికల్ సర్వే మొదలు కొని ఇతర కీలక సమాచారం కోరారు. జల సౌధలో నిర్వహించిన ఈ సమావేశానికి కాళేశ్వరం ప్రాజెక్టు పునాది రాయి నుంచి రిబ్బన్ కట్టింగ్ వరకు పనిచేసిన ఇంజనీర్లు.. ఈఎన్సీలు, రిటైర్డ్, బదిలీ అయిన ప్రస్తుతం ఉన్న ఇంజనీర్లు సమావేశానికి హాజరు కావాలని కోరినా మొన్నటి వరకు ఈఎన్సీ గా పని చేసిన మురళీధర్,వెంకటేశ్వర్లు ఇద్దరు పలు కారణాలతో సమావేశానికి దూరంగా ఉన్నారు.

    ఎన్ డిఎస్ ఏ కమిటీ సభ్యులు మరో సారి అధికారులతో త్వరలో భేటీ కానున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా కాళేశ్వరం విషయంలో కేసిఆర్ అన్ని తానై, నిర్మాణం చేపట్టడంతో ఈ పరిస్థితి వచ్చిందని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు – బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం – కాగ్ వాస్తవాలు పేరిట వివిధ పార్టీలు, ప్రజల సంఘాలతో తెలంగాణ జన సమితి బహిరంగ చర్చ ఏర్పాటు చేసింది. చర్చలో పాల్గొన్న కోదండరాం బీఆర్ఎస్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. మేడిగడ్డ లో కుంగింది మూడు పిల్లర్లు కాదని, తెలంగాణ లోని మూడు వ్యవస్థలు కుప్ప కులాయని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,ఎమ్మెల్యే సాంబశివరావు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కు శనేశ్వరంగా మారిందని, బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ డిఎస్ ఏ కమిటీ నివేదిక అందించిన కాళేశ్వరం మరమ్మతులు, నిర్వహణ తెలంగాణ కు తలకు మించిన భారం అవుతుందని.. కాళేశ్వరం కోసం తెచ్చిన అప్పులు రీషెడ్యూల్ చేసి వడ్డీ లేకుండా సింగిల్ టైం సెటిల్మెంట్ గా మార్చితే.. రాష్ట్ర ప్రభుత్వం మీద వడ్డీల భారం తగ్గుతుందని, మరో వైపు ఎల్లంపల్లి బ్యారేజ్ ని పటిష్టం చేసి..తుమ్మిడిహెట్టి నుంచి గతంలో మైలవరం వరకు నిర్మించిన 73 కిలో మీటర్ల కాలువలను పొడిగిస్తూ, ఎల్లంపల్లికి తీసుకురావ డం సాధ్యం అవుతుందని, అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాదని నిపుణులు అభిప్రా యపడుతు న్నారు. కాళేశ్వరం మీద అయితే బహిరంగ చర్చలో పలు తీర్మానాలను ప్రజాసంఘాల నేతలు ఆమోదిం చారు.

కాళేశ్వరం మీద వేసిన కమిటీ ఎప్పటి లోగా నివేదిక ఇస్తుందనేది ఇప్పుడే చెప్పలేం.. మరో వైపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాళేశ్వరం ప్రచారంలో భాగం అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అయితే కాళేశ్వరం మీద పెట్టిన ఖర్చు ఉపయోగంలోకి రావాలంటే.. మరమ్మతులు తప్పని సరి.. అయితే అది ఏ విధంగా అనేది కమిటీ తెలుస్తుంది. అదే సమయంలో మరింత భారం పడుతుంది. అయినా ప్రాజెక్టు కింద వ్యవసాయానికి నీరు అందాలంటే వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ నిపుణుల కమిటీ మీద నే భారం వేసి, కాస్తా ఆలస్యం అయిన సరైన నిర్ణయం తీసుకుంటామని, తొందరపడబోము అని అంటున్నారు. కానీ దీంతో కాళేశ్వరం కింద సాగు అవుతున్న పంటలు పండిస్తున్న రైతులు నష్టపోయే అవకాశం ఉంది.

పార్లమెంట్ ఎన్నిక ప్రచారంలో నీటి వివాదాన్నే ప్రధానాంశం చేసేందుకు మూడు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ రైతుల సెంటిమెంట్ ఉపయోగించుకుంటే.. కాంగ్రెస్ కాళేశ్వరం బీఆర్ ఎస్ ప్రభుత్వం సర్కార్ అవినీతి వల్లే కూలిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలకు కాళేశ్వరం అంశం విచారణను అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ ను కాపాడేందుకు కాంగ్రెస్ పరోక్షంగా కృషిచేస్తోందని విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ లో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరే అవకాశం ఉంది. మరి పార్లమెంట్ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రచారం ఏ పార్టీకి ఉపయోగ పడుతుందో.. ఏ పార్టీల నుంచి ఎంత మంది నేతలను ఎవరు లోక్ సభ కు పంపుతుందో చూడాలి.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్