మంత్రి నారా లోకేశ్ని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. మైదుకూరులో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం సమక్షంలో ఆయన మాట్లాడారు. మంత్రి లోకేశ్ణి డిప్యూటీ సీఎంగా చేస్తే రాష్ట్రంలోని యువతకు మరింత భరోసా ఉంటుందని అభిప్రాయపడ్డారు. తప్పుగా మాట్లాడి ఉంటే మన్నించాలని ముఖ్యమంత్రిని కోరారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.