శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకంపై శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా చేస్తున్న సినిమా ‘దక్ష’. తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా, వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్లలో విడుదలకి సిద్దంగా ఉంది.
ఈ సందర్భంగా హీరోయిన్ నక్షత్ర.. బాలయ్య నూతన సినిమా “భగవంత్ కేసరి” లొకేషన్లో కలిసి, బాలయ్య ఆశీస్సులు తీసుకుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ దక్ష టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ ‘‘బాలకృష్ణ గారు చాలా మంచి వ్యక్తి. సున్నితమైన మనసు గల వ్యక్తి. మా దక్ష సినిమాకి విషెస్ తెలిపారు. అలానే కలిసి భోజనం చేశాం. ఆయన మా లాంటి యువతకి మార్గదర్శనీయం.’’ అని చెప్పారు.
ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్-తల్లాడ సాయికృష్ణ, సంగీతం- లలిత్
నటి నటులు: ఆయుష్, అను, నక్షత్ర, రవి రెడ్డి, అఖిల్, శోభన్ బాబు