తెలంగాణలో మరిన్ని ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ తోపాటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకోవడంతో మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాల్సిరావడంతో ఇటీవలే 100 బస్సులను అందుబాటులోకి తెచ్చి ప్రయాణికుల ఇబ్బందులను దూరం చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ మరిన్ని నూతన బస్సులను అందుబాటులోకి తెచ్చింది టీఎస్ ఆర్టీసీ.