ఏపీ ప్రజలు కూటమికి అపూర్వమైన విజయాన్ని అందించారని ప్రధాని మోడీ అన్నారు. ప్రజలు కూటమికి ఇచ్చిన ఆశీస్సులకు ధన్యవాదాలు తెలిపారు. ఘన విజయం సాధించినందుకు చంద్రబాబు నాయుడు , పవన్ కల్యాణ్ తోపాటు బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచేందుకు కృషి చేస్తామని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్టీఏ కూటమిపై దేశ ప్రజలు విశ్వాసాన్ని ఉంచారని ఇదొక చారిత్రక ఘట్టమేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా గడిచిన దశాబ్దికాలంలగా చేస్తు న్న అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళతామని చెప్పారు. మరో వైపు ఒడిశా ప్రజలు కూడా ఘన విజయాన్ని అందించారని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధిలో ఒడిశా రాష్ట్రాన్ని కొత్త దిశగా నడిపిస్తా మన్నా రు.