24.1 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

జ‌గ‌న్‌కు కృత‌జ్ఞత‌లు తెలిపిన ఎమ్మెల్సీ బొత్స

విశాఖ స్ధానిక సంస్ధల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు హాజరయ్యారు.

స్థానిక సంస్థ ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు బొత్స సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు.స్థానిక వైసీపీ నేతలకు అన్నిటి కంటే ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతగా ఎమ్మెల్సీ పదవి నిర్వహిస్తానని బొత్స తెలిపారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసిందని, అమలుకు ఇంకా టైం ఉంది కదా చూద్దామని బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రమాణ స్వీకారం చేసేముందు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ను బొత్స సత్యనారాయణ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా బొత్సను జ‌గ‌న్ అభినందించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్