తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మెడికో ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నట్లు ఆమె తండ్రి నరేందర్ తెలిపారు. వరంగల్ సీపీ రంగనాథ్ కలిసిన ఆయన ప్రీతి మరణంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ప్రీతి ఆత్మహత్యకు పాల్పడినట్లు సీపీ ఆధారాలను చూపించారని ఆయన తెలిపారు. అయితే ఈ కేసు ఛార్జీషీటులో మరికొంత మంది పేర్లను చేర్చాలని సీపీని కోరినట్లు చెప్పారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కూడా నిష్పక్షపాతంగా జరుగుతోందని పేర్కొన్నారు.
అయితే శుక్రవారం ప్రీతి పోస్టుమార్టం వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీపీ రంగనాథ్ ఆమెది ఆత్మహత్యేనని తేల్చారు. దీనిపై ప్రీతి తండ్రి ఆగ్రహం వ్యక్తంచేస్తూ తమ కూతురిది హత్యేనని ఆరోపించారు. ఇప్పుడు సీపీని కలిసిన అనంతరం ఆత్మహత్యే అని నమ్ముతున్నానని ఆయన చెప్పడం గమనార్హం.