24.9 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

సామాన్యుడి కాళ్లు కడిగి క్షమాపణలు చెప్పిన సీఎం

స్వతంత్ర వెబ్ డెస్క్:  ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో మూత్ర విసర్జన ఘటనలో బాధితుడిని పరామర్శించాడు. శివరాజ్ బాధితురాలికి క్షమాపణలు చెప్పడమే కాకుండా కాళ్లు కడిగి తన బాధను వ్యక్తం చేశాడు. ఇటీవల సిద్ధి జిల్లాలో పర్వేష్ శుక్లా అనే నిందితుడు దాస్మేష్‌పై మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ స్వయంగా స్పందించి నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయమని ఆదేశించారు. నిందితుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ గిరిజన బాధితుడి పాదాలను కడిగి, తన మనస్సు చాలా చలించిపోయిందని అన్నారు.

నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎస్సీ ఎస్టీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడి ఇంటిని అధికారులు బుల్డోజర్‌తో కూల్చివేశారు. బాధిత కూలీని కలవడానికి ముందు సీఎం మాట్లాడుతూ ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. తన హృదయం బాధతో నిండిపోయిందని పేర్కొన్నారు. బాధితుడిని, ఆయన కుటుంబాన్ని భోపాల్‌లో కలవనున్నట్టు చెప్పారు. ఆ తర్వాత దాస్మేష్‌ను కలిసిన సీఎం ఆయన కాళ్లు కడిగి శాలువాతో సత్కరించారు. ఆపై జరిగిన ఘటనకు క్షమాపణలు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్