22.7 C
Hyderabad
Friday, October 24, 2025
spot_img

సీఆర్డీఏ కమిషనర్ ని కలిసిన అమరావతి రైతు సమన్వయ కమిటీ నేతలు

స్వతంత్ర, వెబ్ డెస్క్: సీఆర్డీఏ కమిషనర్ ని కలిసిన అమరావతి రైతు సమన్వయ కమిటీ నేతలు.. కౌలు చెల్లింపు ఆలస్యం పై గంటకు పైగా కమిషనర్ తో చర్చించారు. ఈ సందర్భంగా సీబీ సీఐడీ కేసులు త్వరగా తేల్చాలని కమిషనర్ ను రైతులు కోరారు. సెంట్ స్థలాలు డెవలప్మెంట్ చేసిన విధముగా రైతుల ప్లాట్ లు డెవలప్మెంట్ చేయాలని కోరారు. రాజధాని ప్రాంతాల్లో డెవలప్మెంట్ కి డబ్బులు లేవని కమిషనర్ తేల్చి చెప్పారు. ఏదేమైనా వచ్చేనెల 8వ తేదీ లోగా రైతుల ప్లాట్లు డెవలప్మెంట్ చేయాలని లేకపోతే పోరాటం చేస్తామని కమిషనర్ కు రైతులు వివరించారు. సెంట్ భూములు తరహా లోనే రైతులకు న్యాయం చేయకపోతే సెంట్ భూములను యధా స్థానానికి తీసుకొస్తామన్నారు. అలాగే రైతుల ఫ్లాట్లలో అక్రమంగా మట్టిన తవ్వుకుపోతున్న అంశాలన్నీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతులు తమ దగ్గరికి వచ్చిన సమస్యలపై చర్చించిన కమిషనర్.. మట్టి అక్రమ రవాణా దారులపై చర్యలు తీసుకొంటామని.. అలాగే 25వ తేదీ లోగా కౌలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్