స్వతంత్ర, వెబ్ డెస్క్: బీఆర్ ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల పేరుతో పాలమూరు జిల్లాలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టు పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నాయని అసహనం చేశారు. కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టులు కట్టి ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చారా? అని అధికార బీఅర్ఎస్ ను ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో చుక్క నీరైనా రాలేదని మండిపడ్డారు.