స్వతంత్ర, వెబ్ డెస్క్: మూడోసారి కూడా కేసీఆరే తెలంగాణ సీఎం అవుతారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలు తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. కేవలం ఒక పార్టీని అధికారంలో నుంచి దించడానికి బీఆర్ఎస్ రాలేదన్న మంత్రి.. దేశంలో కాంగ్రెస్, బీజేపీ మాత్రమే ఉన్నాయనే ఆలోచన విధానం తప్పుని అన్నారు. రానున్న ఎన్నికలపై ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తూ.. మంచి పనితీరు కనబర్చినవారికే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ.. ప్రజల్లో మమేకమైన ఉండాలని సీఎం ఇదివరకే చెప్పారని అన్నారు.ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉన్నందున టికెట్ల విషయంలో ఇప్పుడే ఏం చెప్పలేమని వ్యాఖ్యానించారు.